ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై షర్మిల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-11-18T01:03:28+05:30 IST

నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు సీఎం కేసీఆర్ అని ట్విట్టర్ వేదికగా వైఎస్‌ఆర్‌ టీపీ షర్మిల మండిపడ్డారు.

ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై షర్మిల ఆగ్రహం

హైదరాబాద్: నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు సీఎం కేసీఆర్ అని ట్విట్టర్ వేదికగా వైఎస్‌ఆర్‌ టీపీ షర్మిల మండిపడ్డారు. ఉద్యమ కారుడు అని చెప్పుకోవడానికి సిగ్గు పడండని సూచించారు. ఇంకా ఎంత మంది బలి తీసుకుంటే నోటిఫికేషన్లు ఇస్తావు దొర అని ఆమె ప్రశ్నించారు. మరొక నిరుద్యోగి ప్రాణం పోకముందే నోటిఫికేషన్లు ఇవ్వండన్నారు. లేదా సీఎం పోస్ట్‌కి రాజీనామా చేయండని సూచించారు. 

Updated Date - 2021-11-18T01:03:28+05:30 IST