అందుకే ఏపీలో కరోనా కేసులు పెరిగాయి : జగన్
ABN , First Publish Date - 2020-04-10T19:02:50+05:30 IST
కరోనాపై యుద్ధంలో వైద్యుల సేవలు ప్రశంసనీయమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు.
అమరావతి : కరోనాపై యుద్ధంలో వైద్యుల సేవలు ప్రశంసనీయమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జగన్ పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ‘డాక్టర్లు చాలా కష్టపడుతున్నారు.. సర్వీసు అందిస్తున్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, పారిశుధ్య సిబ్బంది అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చినవారి కారణంగానే కరోనా కేసులు పెరిగాయి. తెలియని భయం ఉన్నా సేవలు చేస్తున్న వైద్యులకు సెల్యూట్ చేస్తున్నాను. ఢిల్లీ నుంచి వచ్చినవారందరినీ గుర్తించాం. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి’ అని సమీక్షలో జగన్ చెప్పుకొచ్చారు.