యువకుడి కిడ్నాప్.. దర్యాప్తు చేస్తుండగా తిరిగొచ్చిన వైనం
ABN , First Publish Date - 2021-04-18T17:35:13+05:30 IST
అర్ధరాత్రి జరిగిన ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది.
హైదరాబాద్/హసన్నగర్ : నగర శివారు మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. అతని అన్న మునవర్ ఆలంఖాన్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా నదీమ్ ఆలంఖాన్ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. వివరాలిలా ఉన్నాయి. మైలార్దేవుపల్లి కింగ్స్ కాలనీకి చెందిన నదీమ్ ఆలంఖాన్(26) ఫార్మసిస్ట్. ఈ నెల 16న రాత్రి 12:45 గంటలకు ఆస్పత్రి నుంచి తన బైక్పై ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు శాస్త్రీపురంలోని ఆదిబా హోటల్ వద్ద అతన్ని అడ్డగించి కిడ్నాప్ చేసి, కారులో తీసుకెళ్లారు. దీంతో నదీమ్ ఆలంఖాన్ అన్న మునవర్ ఆలంఖాన్ శనివారం మైలార్దేవుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా కిడ్నాప్ నకు గురైన నదీమ్ ఆలంఖాన్ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. నదీమ్ ఆలంఖాన్ను వసీం, అతని అనుచరులు కలసి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నామ ని మైలార్దేవుపల్లి ఇన్స్పెక్టర్ కె.నర్సింహ తెలిపారు.