ఒడిపోతామనే భయంతోనే దాడులు: యరపతినేని

ABN , First Publish Date - 2021-04-13T19:56:22+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఒడిపోతామనే భయంతోనే దాడులు: యరపతినేని

గుంటూరు: తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం విద్యానగర్ కార్యాలయంలో యరపతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా యరపతినేని మాట్లాడుతూ.. టీడీపీకి వచ్చే ఆదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన సంఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే గేట్లు మూసేశారని మండిపడ్డారు. వీరి అహంకారం దించే రోజు దగ్గర్లో ఉందని హెచ్చరించారు. తిరుపతిలో ఒడిపోతామనే భయంతో వైసీపీ దాడులు చేస్తుందన్నారు. బాబుపై దాడిని  తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. రాష్టంలో ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబుపై జరిగిన దాడిని ఖండించాలని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

Updated Date - 2021-04-13T19:56:22+05:30 IST