రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో 8మంది హతం: యరపతినేని

ABN , First Publish Date - 2021-12-03T00:20:11+05:30 IST

టీడీపీ హయాంలో గురజాలలో వైసీపీ నేతలపై ఒక్క దాడి జరగలేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు అన్నారు.

రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో 8మంది హతం: యరపతినేని

అమరావతి: టీడీపీ హయాంలో గురజాలలో వైసీపీ నేతలపై ఒక్క దాడి జరగలేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు అన్నారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో 8 మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారని మండిపడ్డారు. విక్రమ్ అనే యువకుడిని పోలీసులే పిలిపించి హత్యకు సహకరించారని ఆయన ఆరోపించారు. అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించారని ఐదుగురిని కత్తులతో నరికారని ఆరోపించారు. ఇప్పటికి జరిగింది చాలు, ఇక ఇలాంటివి జరగనివ్వమన్నారు. ఇక రాష్ట్రంలో ఇలాంటివి సాగవని వ్యాఖ్యానించారు. రాత్రి పూట కొందరు టీడీపీ వాళ్ళు వైసీపీ నేతలతో మాట్లాడుకునే విధానం మానుకోవాలన్నారు. 

Updated Date - 2021-12-03T00:20:11+05:30 IST