వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవటం ఖాయం: సత్యకుమార్

ABN , First Publish Date - 2020-09-27T21:36:10+05:30 IST

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవటం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జోస్యం చెప్పారు. ఏపీలో వైసీపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవటం ఖాయం: సత్యకుమార్

అమరావతి: వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవటం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జోస్యం చెప్పారు. ఏపీలో వైసీపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించారు. వైసీపీతో బీజేపీకి లోపాయికారీ ఒప్పందం లేదని చెప్పారు. టీడీపీ మునిగిపోతోన్న నావ అని ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ కుటుంబం, సొంత కులాల కోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాసమస్యలపై బీజేపీనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. బీజేపీ, జనసేన పోరాటాన్ని ఏపీ ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. జనసేనాని పవన్‌కల్యాణ్ అవినీతి మచ్చలేని.. నిజాయతీ కలిగిన నాయకుడని సత్యకుమార్ కొనియాడారు.

Updated Date - 2020-09-27T21:36:10+05:30 IST