మళ్లీ వైసీపీదే అధికారం: ధర్మాన కృష్ణదాస్
ABN , First Publish Date - 2022-03-20T01:12:07+05:30 IST
ఇది తథ్యం. లేదంటే నా ఆస్తి మొత్తం ప్రజలకు రాసిస్తా’నని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు.
శ్రీకాకుళం: ‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే అధికారం. సీఎం జగన్ సారథ్యంలోనే ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ఇది తథ్యం. లేదంటే నా ఆస్తి మొత్తం ప్రజలకు రాసిస్తా’నని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నవరత్నాలు’ పేరుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. సీఎం జగన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ప్రజల అభిమానమే.. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తాయని ధర్మాన కృష్ణదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.