ఆ హత్య వెనుక బంధువులే..?: రఘురామరాజు

ABN , First Publish Date - 2021-04-06T22:38:43+05:30 IST

వైఎస్ వివేకానందారెడ్డిని గొడ్డలి పోటు పొడించింది ఎవరు? అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డిని ప్రశ్నించారు.

ఆ హత్య వెనుక బంధువులే..?: రఘురామరాజు

ఢిల్లీ:  వైఎస్ వివేకానందారెడ్డిని గొడ్డలి పోటు పొడించింది ఎవరు? అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డిని ప్రశ్నించారు. మంగళవారం రఘురామరాజు మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందారెడ్డికి కట్లు కట్టింది ఎవరు.. ఆ వైద్యులు ఎవరో తేలాలని వైసీపీ సర్కారును నిలదీశారు. హత్య సమాచారం రాగానే అక్కడి సీఐతో ఎంపీ ఏం మాట్లాడారు? అని ప్రశ్నించారు. సీబీఐ అధికారులతో ఓ ఎంపీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏం మాట్లాడారు? అని నిలదీశారు. వివేకా హత్య వెనుక బంధువులే ఉన్నారని తెలుస్తోందని చెప్పారు. పార్లమెంట్‌లో కూడా వివేకా హత్య విషయం ప్రస్తావిస్తానని రఘురామ స్పష్టం చేశారు. తనపై కేసులు పెట్టాలని సీఎం జగన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రవీణ్ ప్రకాష్ కలిసి.. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్‌పై ఒత్తిడి తెస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-06T22:38:43+05:30 IST