వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకుంటాం: ఎస్పీ
ABN , First Publish Date - 2022-05-22T04:23:45+05:30 IST
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకుంటామని ..
కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ రవీంద్రనాథ్ ప్రకటించారు. మృతుడి కుటుంబీకుల స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్సీ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఐపీసీ 302 సెక్షన్ కింద ఎమ్మెల్సీపై కేసు నమోదు చేస్తున్నామని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.