వైసీపీ ఎమ్మెల్యేపై ప్రభుత్వ పెద్ద చేయిచేసుకున్నారు: రఘురామ
ABN , First Publish Date - 2021-12-31T22:53:23+05:30 IST
వైసీపీ ఎమ్మెల్యేను తాజాగా ప్రభుత్వ పెద్ద చేయిచేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న సమాచారం తన దగ్గరుందని
ఢిల్లీ: వైసీపీ ఎమ్మెల్యేపై తాజాగా ప్రభుత్వ పెద్ద చేయిచేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న సమాచారం తన దగ్గరుందని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేను చేయిచేసుకున్న విషయం త్వరలో బయటకు వస్తుందన్నారు. ఒకే పార్టీలోని ఎంపీకి, ఎమ్మెల్యేకు మధ్య ఆధిపత్యపోరు వల్లే ఘటన జరిగిందని తెలిపారు. ప్రస్తుతం సొంతింటిని చక్కదిద్దే పనిలో ఉన్నానని పేర్కొన్నారు. చక్కదిద్దలేకపోతే అప్పుడు పక్క పార్టీల వైపు చూస్తానని తెలిపారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఇబ్బంది పెట్టడానికే తమ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై పడిందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ తీరుతో క్వాలిటీ సినిమా తీసే పరిస్థితులు ఉండవన్నారు. రూ. 5 తో సులభ్ కాంప్లెక్స్లో టాయిలెట్ కూడా చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. ఏపీ ప్రజలకు రూ. 5 తో సినిమా చూపిస్తున్న సీఎం జగన్కు రఘురామకృష్ణరాజు అభినందనలు తెలిపారు.