విశాఖలో బరితెగించిన వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2022-02-20T20:33:22+05:30 IST
విశాఖలో వైసీపీ నేతలు బరితెగించారు. మాకవరపాలెం దాబాలో మద్యం తాగి వీరంగం సృష్టించారు. దాబా పరిసర ప్రాంత ప్రజలు డయల్
విశాఖ: విశాఖలో వైసీపీ నేతలు బరితెగించారు. మాకవరపాలెం దాబాలో మద్యం తాగి వీరంగం సృష్టించారు. దాబా పరిసర ప్రాంత ప్రజలు డయల్ 100కు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను కూడా వైసీపీ నేతలు లెక్కచేయలేదు. ‘‘నీకు సమాధానం చెప్పడానికి ఎమ్మెల్యే రావాలా?.. మేము ఏం చేసినా మా ఎమ్మెల్యే చూసుకుంటాడు’’ అంటూ.. పోలీసులపై వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మద్యం తాగి హల్చల్ చేసిన వారిలో గొలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీ భర్త సన్యాసినాయుడు, పాకలపాడు స్కూల్ కమిటీ చైర్మన్ నానాజీ వారి స్నేహితులున్నారు. దాబాలో వైసీపీ నేతల హల్చల్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.