చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ నేతల అరాచకం

ABN , First Publish Date - 2020-11-25T21:46:35+05:30 IST

చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు. కట్టుబడివారిపాలెంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గాయాలతో ఓ వర్గం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది

చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ నేతల అరాచకం

గుంటూరు: చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు. కట్టుబడివారిపాలెంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గాయాలతో ఓ వర్గం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిపై మరో వర్గం దాడికి తెగబడింది. కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసింది. ఈ ఘటనతో ఇతర రోగులు, వైద్య సిబ్బంది బెంబేలెత్తిపోయారు. దాడిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. ఓ స్థలం వివాదంలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-25T21:46:35+05:30 IST