ABN ప్రతినిధిపై వైసీపీ దాడిని ఖండించిన జాప్ చైర్మన్
ABN , First Publish Date - 2021-10-20T00:40:27+05:30 IST
ఏబీఎన్ ప్రతినిధిపై వైసీపీ దాడిని జాప్ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల కార్యాలయాలపై ..
అమరావతి: ABN ప్రతినిధిపై వైసీపీ దాడిని జాప్ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల కార్యాలయాలపై దాడులు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. దాడులపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఉప్పల లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
కాగా టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి చేశారు. అద్దాలు, వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. విధ్వంసాన్ని చిత్రీకరిస్తున్న మంగళగిరి ABN రిపోర్టర్పై దాడి చేశారు. ABN రిపోర్టర్ పొత్తికడుపులో వైసీపీ నేతలు గుద్దారు. రిపోర్టర్ ఫోన్ని వైసీపీ ముష్కరులు ఎత్తుకెళ్లారు.