అనంతపురంలో వైసీపీ నేత మన్సూర్ దౌర్జన్యం
ABN , First Publish Date - 2020-10-22T01:58:51+05:30 IST
అనంతపురంలో వైసీపీ నేత మన్సూర్ దౌర్జన్యం
అనంతపురం: అనంతపురంలో వైసీపీ నేత మన్సూర్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. యాసిడ్ పోసి, గొంతుకోసి చంపుతానంటూ ఓ మహిళను బెదిరించారు. తన భర్త చావుకు వైసీపీ నేత మన్సూరే కారణమని సల్మా అనే మహిళ ఆరోపిస్తోంది. న్యాయం కోసం వెళితే తనను మన్సూర్ లొంగదీసుకున్నాడని బాధితురాలు సల్మా వాపోయింది. తన పిల్లలను చూసుకుంటానని మాయమాటలు చెప్పి.. ఇప్పుడు తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని, ఈ వ్యవహారం బయటపెడుతాననే తనను బెదిరిస్తున్నాడని సల్మా ఆవేదన వ్యక్తం చేసింది. మన్సూర్, అనుచరుల వల్ల తనుకు ప్రాణహాని ఉందని ఆమె చెబుతోంది. ‘మేం పులివెందుల వాళ్లం, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరంటూ’.. తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, పర్సనల్ ఫొటోలో సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని సల్మా వాపోయింది.