అమరావతి: వైసీపీ (YCP) ప్రభుత్వం ఏ వర్గానికి మంచి చేసింది? అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు. కడప జిల్లా (Kadapa District)లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సభలో చంద్రబాబు మాట్లాడుతూ రైతులు దెబ్బతిన్నారని, యువతకు ఉద్యోగాలు రాలేదని చెప్పారు. టీడీపీ హయాంలో టెక్నాలజీ రంగాన్ని డెవలప్ చేశానని గుర్తుచేశారు. ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తానని ప్రకటించారు. ప్రోత్సహిస్తే ప్రపంచ స్థాయికి ఎదిగే శక్తి ఏపీ యువతకు ఉందని తెలిపారు. మద్యం ధరలు ఇష్టానుసారం పెంచడంతో.. ప్రజలు సారా, గంజాయి వైపు మళ్లారని తెలిపారు. డబ్బు కోసం కల్తీ మద్యం అమ్ముతున్నారని తప్పుబట్టారు. జే-బ్రాండ్తో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం వందల ఎకరాలు కొట్టేశారని, ఊరికో సైకోను తయారు చేశారని చంద్రబాబు ఆరోపించారు.