ఏపీని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-12-17T23:19:49+05:30 IST

ఏపీని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని సీపీఐ రామకృష్ణ ధ్వజమెత్తారు. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో రామకృష్ణ

ఏపీని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది: రామకృష్ణ

తిరుపతి: ఏపీని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని సీపీఐ రామకృష్ణ ధ్వజమెత్తారు. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రాంతాల మధ్య సీఎం జగన్‌రెడ్డి చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. రాజధానిపై జగన్‌రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమానికి బీజేపీ రాష్ట్ర నేతలు మద్దతిస్తున్నారని, కేంద్రమంత్రి అమిత్‌షా ఒక్క ఫోన్‌ చేస్తే జగన్‌ శిరసావహిస్తారని తెలిపారు. ప్రధాని మోదీ ఒక్క ఫోన్‌ చేస్తే జగన్‌ అమరావతిని కాదంటారా? అని రామకృష్ణ ప్రశ్నించారు.

Updated Date - 2021-12-17T23:19:49+05:30 IST