వైసీపీ కవ్వింపు చర్య

ABN , First Publish Date - 2022-05-20T08:49:11+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ కవ్వింపు చర్యలకు దిగింది. సోమందేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం బాదుడే బాదుడు కార్యక్రమానికి టీడీపీ

వైసీపీ కవ్వింపు చర్య

సోమందేపల్లిలో హఠాత్తుగా వైసీపీ జెండా

చంద్రబాబు సభ జరిగే చోట ఆవిష్కరణ


సోమందేపల్లి, మే 19: శ్రీసత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ కవ్వింపు చర్యలకు దిగింది. సోమందేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం బాదుడే బాదుడు కార్యక్రమానికి టీడీపీ అధినేత హాజరు కానున్నారు. ఆయన ప్రసంగించే స్థలం సమీపంలో వైసీపీ జెండాను ఆ పార్టీ నాయకులు గురువారం ఉన్నట్టుండి ఆవిష్కరించారు. ఇన్ని రోజులుగా లేని జెండా ఇప్పుడెందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రాక సమయంలోనే వైసీపీ నాయకులు తమ పార్టీ జెండా పాతడం విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబుకు సీఎం సొంత జిల్లాలో ప్రజలు ఘనస్వాగతం పలికారని, దీంతో వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని టీడీపీ నేతలు విమర్శించారు. 

Updated Date - 2022-05-20T08:49:11+05:30 IST