బాహాబాహీకి దిగిన చీరాల నియోజకర్గ వైసీపీ కార్యకర్తలు
ABN , First Publish Date - 2020-05-30T20:47:45+05:30 IST
ప్రకాశం: చీరాల నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి పాల్పడ్డారు. వేటపాలెం మండలం రామాపురంలో..
ప్రకాశం: చీరాల నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి పాల్పడ్డారు. వేటపాలెం మండలం రామాపురంలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలనూ పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామ కాపును ఎన్నుకునే విషయంలో గత వారం రోజులుగా గ్రామంలో వివాదం నడుస్తోంది. తాజాగా రామలింగయ్య అనే వ్యక్తి స్థలంలో ఉన్న రాజారావు అనే వ్యక్తికి చెందిన కర్రలను తీయమనటంతో ఘర్షణ చెలరేగింది.