'గడప గడప' కార్యక్రమం కోసం వైసీపీ తంటాలు
ABN , First Publish Date - 2022-06-13T21:14:54+05:30 IST
'గడప గడప' కార్యక్రమం కోసం వైసీపీ తంటాలు పడుతోంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేల పీఏలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. శాసనసభ ఆవరణలో పీఏలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అమరావతి: 'గడప గడప' కార్యక్రమం కోసం వైసీపీ తంటాలు పడుతోంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేల పీఏలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. శాసనసభ ఆవరణలో పీఏలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు, పీఏలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై అసహనం వ్యక్తం చేస్తుండడంతో ఈ ఏర్పాటు అంటూ చర్చ జరిగింది. పార్టీ, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం బాధ్యతలు ఎమ్మెల్యేల నుంచి పీఏలకు షిఫ్ట్ చేస్తున్నట్లు సమాచారం.