చీరాల నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల బాహాబాహీ
ABN , First Publish Date - 2020-05-30T20:50:01+05:30 IST
చీరాల నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల బాహాబాహీకి దిగారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో వైసీపీ నేతలు కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.
ప్రకాశం: చీరాల నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల బాహాబాహీకి దిగారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో వైసీపీ నేతలు కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గ్రామ కాపును ఎన్నుకునే విషయంలో వారం రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగుతోంది. రామలింగయ్య స్థలంలో రాజారావుకు చెందిన కర్రలను తీయమనటంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.