బుగ్గన వ్యాఖ్యలపై యనమల కౌంటర్
ABN , First Publish Date - 2020-06-06T01:47:38+05:30 IST
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కౌంటరిచ్చారు. ఈ ఏడాది ఆర్ధికాభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ..
అమరావతి: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కౌంటరిచ్చారు. ఈ ఏడాది ఆర్ధికాభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ.. బుగ్గనకు, యనమల సవాల్ విసిరారు. అబద్దాలతో అప్పులను దాచడం అసాధ్యమని, గత ఆర్ధిక సంవత్సరంలో కరోనా ప్రభావం 9రోజులే... కరోనా కంటే నాలుగైదు రెట్ల నష్టం 'జగోనా' (వైసీపీ) వల్ల జరిగిందని ఆరోపించారు. అనుభవం టీడీపీది అయితే, అబద్దాలు వైసీపీవి అని యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు.