మార్కెట్ యార్డుల చైర్మన్లూ భాగస్వాములు కండి : సీఎం
ABN , First Publish Date - 2020-03-31T21:25:25+05:30 IST
కోవిడ్ –19 ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని...
అమరావతి: కోవిడ్ –19 ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మార్కెట్యార్డుల చైర్మన్లనూ ఇందులో భాగస్వాములు చేయాలని సూచించారు. ఇప్పటికీ ఖాళీగా ఉన్న మిగతా మార్కెట్ యార్డుల చైర్మన్ పోస్టులను భర్తీచేసి, వారిని పట్టణ, నియోజకవర్గ టాస్క్ఫోర్సుల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రభుత్వానికి లేదా ప్రజలకు ఏవిధమైన సహాయం చేయాలనుకున్నా జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలోని టాస్క్ఫోర్స్ కమిటీలను సంప్రదించాలని సీఎం ఆదేశించారు.