పొద్దున లేవగానే కనిపించని భార్య.. నిద్రమత్తులోనే పక్క గదిలోకి వెళ్తే కనిపించిన సీన్‌ చూసి ఆ భర్తకు..

ABN , First Publish Date - 2021-10-02T23:12:28+05:30 IST

భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు అన్నట్లుగా అన్యోన్యంగా కలిసి ఉండేవారు. ఎంతో సంతోషంగా గడిచిపోతున్న వారి జీవితంలో ఓ రోజు తీరని విషాదం నింపింది. ఆ రాత్రి వారిద్దరూ కలిసి భోజనం చేసి నిద్రపోయారు. అప్పుడు కూడా తన బాధను

పొద్దున లేవగానే కనిపించని భార్య.. నిద్రమత్తులోనే పక్క గదిలోకి వెళ్తే కనిపించిన సీన్‌ చూసి ఆ భర్తకు..

లక్నో: భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు అన్నట్లుగా అన్యోన్యంగా కలిసి ఉండేవారు. ఎంతో సంతోషంగా గడిచిపోతున్న వారి జీవితంలో ఓ రోజు తీరని విషాదం నింపింది. ఆ రాత్రి వారిద్దరూ కలిసి భోజనం చేసి నిద్రపోయారు. అప్పుడు కూడా తన బాధను భర్తకు కూడా చెప్పకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకుంది. ఉదయం లేవగానే అతడికి ఇంట్లో భార్య కనిపించలేదు. నిద్రమత్తులోనే పక్క గదిలోకి వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతడు షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..


ఉత్తరప్రదేశ్‌లోని బర్‌ద్వారా గ్రామానికి చెందిన భజనియాకు కుష్బూ దేవితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు. ఆ తర్వాత కుష్బూ నిద్ర లేచి ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. ఉదయం నిద్ర లేచిన భర్తకు భార్య అలికిడి వినిపించలేదు. నిద్రమత్తులోనే వేరే గదిలోకి వెళ్లి చూడగా భార్య ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ చూసి అతడు షాకయ్యాడు. 

 

గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఎందుకు చనిపోయిందన్న వివరాలపై భర్తను విచారిస్తున్నారు. కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా..? భర్త వేధింపులు ఏమైనా ఉన్నాయా..? అన్న వివరాలను స్థానికుల నుంచి ఆరాతీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2021-10-02T23:12:28+05:30 IST