మహిళా కమిషన్ కార్యాలయం వద్ద హై టెన్షన్
ABN , First Publish Date - 2022-04-27T16:57:52+05:30 IST
మహిళా కమిషన్ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తెలుగు మహిళా అధ్యక్షురాలు..
అమరావతి : మహిళా కమిషన్ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మహిళకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురైన కుటుంబ సభ్యులతో కలిసి వంగలపూడి అనిత మహిళా కమిషనర్ కార్యాలయానికి వచ్చారు.