కరోనాతో మహిళ మృతి?
ABN , First Publish Date - 2020-04-10T06:28:33+05:30 IST
హైదరాబాద్లో జానకీ నగర్కు చెందిన ఓ యువతి సౌదీ నుంచి ఇటీవలే ఇంటికి వచ్చింది. అప్పుడే ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ వచ్చింది.
లంగర్హౌస్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లో జానకీ నగర్కు చెందిన ఓ యువతి సౌదీ నుంచి ఇటీవలే ఇంటికి వచ్చింది. అప్పుడే ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ వచ్చింది. ఆమె వచ్చిన రోజుల వ్యవధిలోనే తండ్రి చనిపోయాడు. గురువారం తల్లి చనిపోయింది. మూడు రోజుల్లోనే ఇద్దరు మృతి చెందడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనాతోనే చనిపోయి ఉండొచ్చని రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించారు. యువతి తల్లి కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించింది.