తిరుపతిలో భారీ వర్షం.. నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం

ABN , First Publish Date - 2021-10-23T19:22:40+05:30 IST

తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం పాలైంది.

తిరుపతిలో భారీ వర్షం.. నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం

తిరుపతి: తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం పాలైంది. తిరుపతిలో కురిసిన భారీ వర్షానికి వెస్ట్ చర్చి వద్దనున్న అండర్ బ్రిడ్జి కిందకు భారీ నీరు చేరుకుంది. నవ వధువు సంధ్య కర్ణాటక రాష్ట్రం రాయచూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుండగా తిరుపతి వెస్ట్ చర్చి వద్దనున్న అండర్ బ్రిడ్జి వద్దకు రాగానే కారు వర్షపు నీటిలో చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో నవ వధువు సంధ్య మృతి చెందింది. మరో చిన్నారికి అస్వస్థత చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేబీ పరిస్థితి నిలకడగా ఉంది.


 ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు కుటుంబాన్ని కాపాడారు.


Updated Date - 2021-10-23T19:22:40+05:30 IST