మర్కల్ శివారులో సగం కాలి బూడిదైన యువతి శవం లభ్యం
ABN , First Publish Date - 2021-11-25T17:34:10+05:30 IST
సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో ఓ వ్యవసాయ బావి వద్ద సగం కాలి బూడిదైన యువతి శవం లభ్యమైంది.
కామారెడ్డి : సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో ఓ వ్యవసాయ బావి వద్ద సగం కాలి బూడిదైన యువతి శవం లభ్యమైంది. ఎక్కడో హత్య చేసి మర్కల్ శివారుకు తీసుకొచ్చి కాల్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి వయస్సు సుమారు 28 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని అంచనా. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.