మెరిసిన కోహ్లీ, పంత్.. విండీస్ ఎదుట భారీ లక్ష్యం

ABN , First Publish Date - 2022-02-19T02:17:34+05:30 IST

విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు

మెరిసిన కోహ్లీ, పంత్.. విండీస్ ఎదుట భారీ లక్ష్యం

కోల్‌కతా: విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న మాజీ సారథి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించాడు. 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 30వ అర్ధ సెంచరీ. మొత్తంగా 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.


రిషభ్ పంత్ కూడా బ్యాట్ ఝళిపించాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో  52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల్లో పంత్‌కు ఇది మూడో అర్ధ సెంచరీ. వెంకటేశ్ అయ్యర్ 33 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 19 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ (2), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా నిరాశ పరిచారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్‌కు 3 వికెట్లు దక్కగా, షెల్డర్ కాట్రెల్, రొమారియో చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2022-02-19T02:17:34+05:30 IST