భర్త వేధింపులు భరించలేని గృహిణి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-09-24T12:32:44+05:30 IST
భర్త వేధింపులు భరించలేని ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్/మల్కాజిగిరి : భర్త వేధింపులు భరించలేని ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ హరిప్రసాద్ వివరాల ప్రకారం... వాణినగర్కు చెందిన వరహాల పద్మలత తన సోదరి సరస్వతి గతంలో చనిపోవడంతో ఆమె ఇద్దరు ఆడపిల్లలను దత్తతకు తీసుకుని పోషించుకుంటోంది. పెద్ద కూతురు దుర్గాలక్ష్మి, చిన్నకూతురు శిరీష(30). ఇద్దరికీ పెళ్లిళ్లు చేసింది. శిరీషకు 2012లో నాగరాజు(33) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
వారికి ముగ్గురు పిల్లలు. కొంతకాలంగా నాగరాజు వారి తల్లిదండ్రుల ప్రోత్సహంతో భార్య శిరీషను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీంతో విసుగుచెందిన శిరీష బుధవారం సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పద్మలత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.