నేడు హోల్సేల్ కూరగాయల మార్కెట్ పునఃప్రారంభం
ABN , First Publish Date - 2020-06-07T12:25:51+05:30 IST
నేడు హోల్సేల్ కూరగాయల మార్కెట్ పునఃప్రారంభం
గుంటూరు: బొంతపాడులో హోల్సేల్ కూరగాయల మార్కెట్ని ఆదివారం సాయంత్రం నుంచి పునఃప్రారంభించనున్నట్లు మార్కెట్లోని వర్తకులు తెలిపారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో మార్కెట్కు చెందిన 22 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. దాంతో మార్కెట్ని మూసేశారు. ప్రజలు కూరగాయలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున కలెక్టర్ విజ్ఞప్తి మేరకు షాపుల మధ్యన 40 అడుగుల దూరం పాటిస్తూ ఆదివారం సాయంత్రం నుంచి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నామని వర్తకులు తెలిపారు.