మలుపు తిరుగుతుంటే.. మృత్యువులా దూసుకొచ్చిన కారు
ABN , First Publish Date - 2022-08-19T08:44:14+05:30 IST
బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు హైవేపై మలుపు తిరుగుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది.
బైక్పై ఇద్దరు యువకులు దుర్మరణం
విజయవాడ (ఇబ్రహీంపట్నం), ఆగస్టు 18: బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు హైవేపై మలుపు తిరుగుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులూ ప్రాణాలు కోల్పోయారు. ఎన్టీఆర్ జిల్లా జూపూడి వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఈ దుర్ఘటన జరిగింది. జూపూడి వద్ద హైవేపై అదే గ్రామానికి చెందిన యాకూబ్ బాషా (21), చిన్నం ప్రశాంత్ (17) ద్విచక్రవాహనంపై మలుపు తిరుగుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేగంగా వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. ఆ వేగానికి బైక్తో సహా ఇద్దరు యువకులు ఎగిరిపడ్డారు. ఆ సమయంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగి దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన యువకులిద్దరినీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబసభ్యులు వారి కళ్లను ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు దానం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.