మలుపు తిరుగుతుంటే.. మృత్యువులా దూసుకొచ్చిన కారు

ABN , First Publish Date - 2022-08-19T08:44:14+05:30 IST

బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు హైవేపై మలుపు తిరుగుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది.

మలుపు తిరుగుతుంటే.. మృత్యువులా దూసుకొచ్చిన కారు

బైక్‌పై ఇద్దరు యువకులు దుర్మరణం

విజయవాడ (ఇబ్రహీంపట్నం), ఆగస్టు 18: బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు హైవేపై మలుపు తిరుగుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులూ ప్రాణాలు కోల్పోయారు. ఎన్టీఆర్‌ జిల్లా జూపూడి వద్ద హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఈ దుర్ఘటన జరిగింది. జూపూడి వద్ద హైవేపై అదే గ్రామానికి చెందిన యాకూబ్‌ బాషా (21), చిన్నం ప్రశాంత్‌ (17) ద్విచక్రవాహనంపై మలుపు తిరుగుతున్న సమయంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వేగంగా వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. ఆ వేగానికి బైక్‌తో సహా ఇద్దరు యువకులు ఎగిరిపడ్డారు. ఆ సమయంలో బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ పగిలి మంటలు చెలరేగి దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన యువకులిద్దరినీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబసభ్యులు వారి కళ్లను ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలకు దానం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


Updated Date - 2022-08-19T08:44:14+05:30 IST