అక్షతా మూర్తికి పన్ను మినహాయింపు ఎంత?

ABN , First Publish Date - 2022-04-08T09:27:05+05:30 IST

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తికి ఇస్తున్న పన్ను మినహాయింపుని విపక్ష లేబర్‌ పార్టీ ప్రశ్నించింది.

అక్షతా మూర్తికి పన్ను మినహాయింపు ఎంత?

వివరణ కోరిన  బ్రిటిష్‌ విపక్షం


లండన్‌: ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు  నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తికి ఇస్తున్న పన్ను మినహాయింపుని విపక్ష లేబర్‌ పార్టీ ప్రశ్నించింది. ఇంకా భారత పౌరసత్వం కొనసాగిస్తూ, ఆమె ఏ మేర పన్ను మినహాయింపు పొందుతున్నారో వివరణ ఇవ్వాలని అక్షతామూర్తి భర్త, బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ను లేబర్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అక్షతామూర్తి ఇప్పటికీ నారాయణ మూర్తి కుటుంబానికి చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ‘క్యాటమరాన్‌ యూకే’లో డైరెక్టర్‌గా కొనసాగుతూ దానిపై వచ్చే ఆదాయంపై మాత్రమే బ్రిటన్‌లో పన్ను చెల్లిస్తున్నారు. భారత్‌లోని వ్యాపారాలపై మాత్రం భారత్‌లోనే పన్ను చెల్లిస్తున్నారు. బ్రిటిష్‌ చట్టాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నట్టు సునాక్‌ ఇంతకు ముందే స్పష్టం చేశారు. 


Updated Date - 2022-04-08T09:27:05+05:30 IST