కార్మికుల సంక్షేమానికి చేసిందేమిటి?: హైకోర్టు
ABN , First Publish Date - 2021-04-16T09:12:50+05:30 IST
అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం సామాజిక భద్రతా మండలి ద్వారా చేపట్టిన కార్యక్రమాలేమిటో చెప్పాలని హైకోర్టుకు హాజరైన కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదినిని హైకోర్టు డివిజన్ బెంచ్
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం సామాజిక భద్రతా మండలి ద్వారా చేపట్టిన కార్యక్రమాలేమిటో చెప్పాలని హైకోర్టుకు హాజరైన కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదినిని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. మాజీ ఉప-ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ మేరకు కార్మికశాఖ స్పెషల్ సీఎస్ ఆన్లైన్ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తదుపరి విచారణ నాటికి తెలపాలని స్పష్టం చేసింది. విచారణను జూలై 1కి వాయిదా వేసింది.