జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెస్టిండీస్ జట్టు

ABN , First Publish Date - 2020-05-30T17:40:44+05:30 IST

వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు విండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. పూర్తిస్థాయిలో సురక్షితమైన వాతావరణంలో తమ టీమ్

జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెస్టిండీస్ జట్టు

వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు విండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. పూర్తిస్థాయిలో సురక్షితమైన వాతావరణంలో తమ టీమ్ ఉంటుందని పేర్కొంది. జూన్ నెలలో వెండీస్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ కారణంగా ఈ సిరీస్‌ను జూలై మొదటి వారానికి వాయిదా వేశారు. 


క్రికెట్ వెస్టిండీస్ ప్రకటన ప్రకారం.. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు, వైద్య నిపుణులతో క్రికెట్ వెస్టిండీస్ ప్రతినిధులు, వైద్య నిపుణులు సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పర్యటనకు సంబంధించిన ప్రణాళికలు పూర్తిగా అందాయని.. ఖాళీ స్టేడియంలలో మ్యాచ్‌లు జరుగతాయని విండీస్ బోర్డు తెలిపింది. అంతేకాక.. జట్టు సభ్యులు సురక్షితమైన వాతావరణంలో బస చేస్తారని పేర్కొంది. జూలై 8, 16, 24 తేదీల్లో హాంప్‌షైర్, ఓల్డ్ ట్రాఫర్డ్‌ వేదికగా ఈ టెస్టులు జరుగనున్నాయి. ఛార్టర్ విమానాల్లో ఆటగాళ్లు ప్రయాణిస్తారని.. అందరు ఆటగాళ్లకు, సిబ్బందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

Updated Date - 2020-05-30T17:40:44+05:30 IST