పశ్చిమగోదావరి జిల్లాలో పొంగుతున్న కొండవాగులు

ABN , First Publish Date - 2020-08-12T17:00:45+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో పొంగుతున్న కొండవాగులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. బుట్టాయిగూడెం మండలం అలివేరులో గుబ్బల మంగమ్మ జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 211 మీటర్లకు చేరుకుంది. మొత్తం నీటిమట్టం  సామర్థ్యం 217.8 మీటర్లుగా ఉంది. అలాగే జలాశయం ఇన్ ఫ్లో 80 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-08-12T17:00:45+05:30 IST