పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా విజృంభణ
ABN , First Publish Date - 2020-07-16T14:07:04+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు మూడు వేలు దాటింది.
పశ్చిమగోదావరి: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు మూడు వేలు దాటింది. నిన్న ఒక్కరోజే 164 కేసులు నమోదయ్యాయి. ఏలూరులో 68 కొత్త కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. మరో తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 3 వేల 23కి చేరింది. కొత్తగా 42 కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.