పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి
ABN , First Publish Date - 2020-08-07T14:27:06+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలో నిన్న 463 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16వేల696కి చేరింది. కొత్తగా ఏలూరులో 37 భీమవరంలో 51, తాడేపల్లిగూడెంలో 34 కేసులు నమోదు అయ్యాయి. అలాగే జిల్లా కొత్తగా 32 కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తూ... 12 కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేశారు.