ఖైదీల హక్కులు కాపాడతాం
ABN , First Publish Date - 2020-07-14T07:52:54+05:30 IST
ఖైదీల హక్కులు కాపాడతాం
- ఎన్హెచ్ఆర్సీకి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం... జీవో జారీ
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లోని జైళ్లలోని ఖైదీల హక్కులను కాపాడతామని, వారి హక్కులపై వివరించి చైతన్య పరుస్తామని జాతీయ హక్కుల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. తమ హక్కులపై ఖైదీలకు అవగాహన కల్పించాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశిస్తూ సోమవారం హోంశాఖ జీవో జారీ చేసింది.