టీడీపీ పాలనలో ఉల్లి రైతులను అదుకున్నాం
ABN , First Publish Date - 2021-09-14T23:24:44+05:30 IST
డీపీ పాలనలో ఉల్లి రైతులను అదుకున్నామని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి కరువు ఏర్పడినప్పుడు పక్క రాష్ట్రాలకు ఉల్లి .....
కర్నూలు: టీడీపీ పాలనలో ఉల్లి రైతులను అదుకున్నామని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి కరువు ఏర్పడినప్పుడు పక్క రాష్ట్రాలకు ఉల్లి తరలించి గిట్టుబాటు ధర కల్పించామని చెప్పారు. వైసీపీ పాలనలో గిడ్డంగులు, పరిశ్రమల రూపు రేఖలు కనుమరుగయ్యాయని ఆరోపించారు. రైతులకు కష్టం కలిగిస్తే ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తొక్కేస్తారని ఆయన హెచ్చరించారు.