మరణించిన జర్నలిస్టు, కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2020-08-15T10:35:13+05:30 IST

తూర్పు నియోజకవర్గంలో కరోనాతో ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన జర్నలిస్టులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంలను అన్ని

మరణించిన జర్నలిస్టు, కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా

తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ 


పోచమ్మమైదాన్‌, ఆగస్టు 14:   తూర్పు నియోజకవర్గంలో కరోనాతో ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన జర్నలిస్టులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. ఇటీవల అకాల మరణం చెందిన  జర్నలిస్టు పొన్నం ప్రవీణ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కావటి రాజుయాదవ్‌, మహ్మద్‌ యాకూబ్‌అలీ, కావటి వెంకటయ్యయాదవ్‌ల సంతాప సభ శుక్రవారం దేశాయిపేట కేఆర్‌ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు.


ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ముఖ్య అతిథిగా హాజరై మృతుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జర్నలిస్టు ప్రతినిధులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, బీఆర్‌ లెనిన్‌, ప్రదీప్‌, కోరుకొప్పుల నరేందర్‌, చాంబర్‌ ఆప్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, కార్పొరేటర్లు దిడ్డి నాగరాజు, బైరబోయిన దామోదర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సురేష్‌జోషి, సయ్యద్‌ మసూద్‌, యెలుగం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T10:35:13+05:30 IST