మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: బొత్స
ABN , First Publish Date - 2022-03-05T21:44:53+05:30 IST
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లు
విజయనగరం: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టే అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. టీడీపీ నేతలు తమకు ప్రామాణికం కాదన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని ప్రకటించారు. జిల్లాల పునర్విభజనపై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఉగాదికి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమవుతుందని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.