మార్కెట్‌లోకి వాటర్‌ ఆపిల్స్‌

ABN , First Publish Date - 2022-04-13T17:42:44+05:30 IST

మార్కెట్‌లోకి కొత్త ఫలం వచ్చింది. ఎరుపు రంగుతో వాటర్‌ ఆపిల్స్‌ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌,

మార్కెట్‌లోకి వాటర్‌ ఆపిల్స్‌

హైదరాబాద్/చిలకలగూడ: మార్కెట్‌లోకి కొత్త ఫలం వచ్చింది. ఎరుపు రంగుతో వాటర్‌ ఆపిల్స్‌ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌, సఫిల్‌గూడ గేట్‌, వాయుపురి చౌరస్తాల్లో విక్రయిస్తున్నారు. వీటిలో నీటి శాతంతోపాటు విటమిన్‌ సి ఉంటుందంటున్నారు. పండ్ల వ్యాపారి మహ్మద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా.. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పండ్లు వస్తాయని, కిలో రూ. 200 ఉంటాయని, కోల్‌కతా నుంచి వస్తాయని, అమ్మకాలు బాగా జరుగుతున్నాయన్నాడు. చాలామంది వాటర్‌ ఆపిల్స్‌ కొనుగోలు చేస్తున్నారని చెప్పాడు.

Updated Date - 2022-04-13T17:42:44+05:30 IST