మంత్రి కేటీఆర్ ను కలిసిన ఉమ్మడి వరంగల్ ప్రజా ప్రతినిధులు

ABN , First Publish Date - 2021-11-30T20:35:51+05:30 IST

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఉమ్మడి వరంగల్ ప్రజా ప్రతినిధులు

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డితదితరులు ప్రగతి భవన్ లోమంత్రి కేటీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్  పోచంపల్లి ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి లను అభినందించారు.

Updated Date - 2021-11-30T20:35:51+05:30 IST