వరంగల్: 29న టీఆర్ఎస్ విజయగర్జన సభ
ABN , First Publish Date - 2021-11-08T16:34:02+05:30 IST
ఓరుగల్లు వేదికగా ఈనెల 29వ తేదీన టీఆర్ఎస్ విజయగర్జన సభ జరగనుంది.
వరంగల్: ఓరుగల్లు వేదికగా ఈనెల 29వ తేదీన టీఆర్ఎస్ విజయగర్జన సభ జరగనుంది. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేటలో జరగనున్న సభ నిర్వహణపై టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. సభకు సుమారు 15 లక్షల మందిని సమీకరించాలని నిర్ణయించారు. జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారిగా ఇంచార్జులను నియామించారు. ములుగు- రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, డోర్నకల్- ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హుజురాబాద్- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, భూపాలపల్లి ఎంపీ పసునూరి దయాకర్, నర్సంపేట- ఎంపీ మాలోత్ కవిత, జనగామ- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, వర్ధన్నపేట- మాజీ ఎంపీ సీతారాం నాయక్, హుస్నాబాద్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మహబూబాబాద్- జడ్పీ చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి, పరకాల- జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, వరంగల్ తూర్పు: డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు,పాలకుర్తి: రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, వరంగల్ పశ్చిమ మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు తదితరులను నియమించారు.