Corona: వరంగల్ జిల్లాలో కరోనా డెత్ కలకలం
ABN , First Publish Date - 2022-07-27T01:59:45+05:30 IST
జిల్లాలో కరోనా డెత్ కలకలం రేపింది. ఖానాపురం మండలం యాపచెట్టుపంచాయతీ పరిధిలోని కోమటిపల్లి తండాకు చెందిన యువకుడు ఇస్లావత్ మురళీ..
వరంగల్ (Warangal): జిల్లాలో కరోనా డెత్ కలకలం రేపింది. ఖానాపురం మండలం యాపచెట్టుపంచాయతీ పరిధిలోని కోమటిపల్లి తండాకు చెందిన యువకుడు ఇస్లావత్ మురళీ (Islawath Murali) కరోనా మృతి చెందారు. అయితే మురళీ నాలుగు రోజుల క్రితం జ్వరం (Fever), జలుబు (Cold)తో బాధపడ్డారు. నిన్న పరిస్థితి విషమించడంతో వరంగల్లోని రోహిణీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో ఎంజీఎం(Mgm)కు తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మురళీ ఇవాళ మృతి చెందారు. మురళీ మృతితో జిల్లా ప్రజల్లో మళ్లీ కరోనా భయం నెలకొంది.