Nelloreలో ఎలుగుబంట్ల సంచారం... భయాందోళనలో గ్రామస్థులు
ABN , First Publish Date - 2022-06-18T15:55:06+05:30 IST
జిల్లాలోని మర్రిపాడు మండలం పి.యన్.పల్లి గ్రామస్థులకు ఎలుగుబంట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం పి.యన్.పల్లి గ్రామస్థులకు ఎలుగుబంట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రంతా చెరువు సమీపంలో ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి. ఎలుగుబంట్ల భయంతో గ్రామ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎలుగుబంట్ల బారి నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.