వోల్వో కొత్త ఎలక్ర్టిక్ కారు ఎక్స్సీ 40
ABN , First Publish Date - 2022-07-27T06:59:05+05:30 IST
స్థానికంగా అసెంబుల్ చేసిన పూర్తి విద్యుత్ ఎస్యూవీ ఎక్స్సీ 40ని వోల్వో ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది.
న్యూఢిల్లీ: స్థానికంగా అసెంబుల్ చేసిన పూర్తి విద్యుత్ ఎస్యూవీ ఎక్స్సీ 40ని వోల్వో ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్షోరూమ్ ధర రూ.55.9 లక్షలు. దేశంలో కంపెనీ అసెంబుల్ చేసిన తొలి లగ్జరీ విద్యుత్ కారు ఇదే. ఒక్కసారి చార్జి చేస్తే ఈ కారు 400 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా తెలిపారు. దీన్ని కేవలం ఆన్లైన్లోనే నేరుగా విక్రయించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ నెల 27 నుంచి ఆన్లైన్ ద్వారా రూ.50,000 చెల్లించి కస్టమర్లు ఈ కారును బుక్ చేసుకోవచ్చు.