Viveka Case: సీబీఐ కస్టడీకి శివశంకర్రెడ్డి
ABN , First Publish Date - 2021-11-26T00:55:22+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రిమాండ్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని ఏడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇచ్చారు.
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రిమాండ్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని ఏడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇచ్చారు. ఈ మేరకు గురువారం పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కడప సెంట్రల్ జైల్లో ఉన్న డి.శివశంకర్రెడ్డిని 8 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై 23వ తేదీ వాదనలు విన్న అనంతరం పులివెందుల కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. గురువారం ఏడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా వివేకా హత్య కేసు విచారణలో భాగంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని ఈనెల 17వ తేదీన హైదరాబాద్లో సీబీఐ అదుపులోకి తీసుకుంది. వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్రెడ్డి ప్రస్తావన ఉంది. దీంతో ఈనెల 15న విచారణకు హాజరుకావాలని దయనకు సీబీఐ సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు.
ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక బృందం ఈనెల 17వ తేదీన హైదరాబాద్లో శివశంకర్రెడ్డిని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారంట్ ద్వారా అక్కడి నుంచి తీసుకొచ్చి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. పులివెందుల కోర్టు 14రోజుల పాటు రిమాండ్ విధించింది. అదే సమయంలో ఆయనను 8 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 23వ తేదీ ఇరువైపు వాదనలు విన్న కోర్టు 25వ తేదీకి వాయిదా వేసింది. 25వ తేదీ గురువారం ఏడు రోజుల పాటు శంకర్రెడ్డిని సీబీఐ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో సీబీఐ శంకర్రెడ్డిని కడప సెంట్రల్ జైలు తమ కస్టడీకి తీసుకున్నట్లు సమాచారం.