ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను చీడ పురుగుల్లా చూస్తోంది : విఠపు బాల సుబ్రహ్మణ్యం

ABN , First Publish Date - 2021-11-26T17:07:26+05:30 IST

ఉద్యోగుల సమస్యలపై మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం చర్చించారు. వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా ఐఆర్ పెంచి ఇవ్వడం సంతోషమన్నారు.

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను చీడ పురుగుల్లా చూస్తోంది : విఠపు బాల సుబ్రహ్మణ్యం

అమరావతి : ఉద్యోగుల సమస్యలపై మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం చర్చించారు. వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా ఐఆర్ పెంచి ఇవ్వడం సంతోషమన్నారు. అయితే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారనేది స్పష్టం చేయడం లేదన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చిందని... ‌కానీ ఇప్పటిదాకా ఆ ఊసే లేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను చీడ పురుగుల్లా చూస్తోందని బాల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఉద్యోగుల సమస్యలపై కాగితాలు ఇచ్చి ఇక అలసిపోయామన్నారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టుంచుకోదని 10 లక్షల మంది ఉద్యోగులకు అర్థమైందన్నారు. ఇక వారితో కలిసి పోరాటాలు చేయడమే శరణ్యమని బాల సుబ్రహ్మణ్యం తెలిపారు.

Updated Date - 2021-11-26T17:07:26+05:30 IST