విశాఖ: ద్వారక పోలీసులను వదలని కరోనా
ABN , First Publish Date - 2020-07-06T16:37:02+05:30 IST
విశాఖ: ద్వారక పోలీసులను వదలని కరోనా
విశాఖ: ద్వారక పోలీసులను కరోనా వైరస్ వెంటాడుతోంది. తాజాగా ద్వారక పోలీస్స్టేషన్ లా అండ్ ఆర్డర్ సీఐ, ఎస్.ఐలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు ద్వారక పోలీస్స్టేషన్లో ఐదుగురు పోలీసులు కరోనా బారిన పడ్డారు. ద్వారకా పోలీస్ స్టేషన్ క్రైమ్ సీఐ, హెడ్ కానిస్టేబుల్, హోమ్గార్డ్లకు ఇదివరకే కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా సీఐ, ఎస్.ఐలు కరోనా బారిన పడటంతో వారిని కలిసిన సిబ్బందిలో కరోనా భయం మొదలైంది.